
రెవెన్యూ, రీ సర్వే వినతుల్ని వారంలో పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అర్జీలు డిస్పోజ్ చేయడం ముఖ్యం కాదని, వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వినతుల్లో 90 శాతం వరకు రెవెన్యూకు చెందినవేనన్నారు